విజయపుర బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్కు చెందిన సిద్దసిరి చక్కెర కర్మాగారాన్ని మూసివేయాలని కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది.

– కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): విజయపుర బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్కు చెందిన సిద్దసిరి చక్కెర కర్మాగారాన్ని మూసివేయాలని కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. కలబురగి జిల్లా చించోలి తాలూకా చిమ్మాయిదలాయి గ్రామంలోని సిద్దసిరి చక్కెర కర్మాగారం నుంచి వెలువడుతున్న కలుషిత నీటిని ముళ్లమూరి రిజర్వాయర్లోకి వదులుతున్నారనే ఆరోపణలున్నాయి. వాయు, నీటి కాలుష్య చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలపై ఫ్యాక్టరీని మూసివేయాలని ఆదేశించారు. అదే విధంగా ఫ్యాక్టరీకి నీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని కౌన్సిల్ ఆదేశించింది. ఇటీవల హుమ్నాబాద్ పట్టణంలోని ప్రసన్న ప్రీ-ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో విషవాయువు కారణంగా ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో హుమ్నాబాద్ ఫ్యాక్టరీతో పాటు చించోలి తాలూకాలోని యత్నాల్కు చెందిన సిద్దసిరి సౌహార్ధ సహకార చక్కెర కర్మాగారాలను వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో రెండు ఫ్యాక్టరీలను మూసివేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న యత్నాల్ ను కట్టడి చేసే కుట్రలో భాగంగానే షుగర్ ఫ్యాక్టరీని మూసేయాలని ఆదేశాలు జారీ చేశారని విజయపుర జిల్లా బీజేపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో పదుల సంఖ్యలో షుగర్ ఫ్యాక్టరీల నుంచి వస్తున్న నీళ్లే ఇక్కడ జరుగుతున్నాయని, రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయమై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే స్పందిస్తూ.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ రూ.1.5 కోట్ల జరిమానా విధించిందని శనివారం కలబురగిలో మీడియాకు వివరించారు. రాష్ట్రంలోని పలు ఫ్యాక్టరీలకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసిందన్నారు. యత్నాల్పై ఎలాంటి రాజకీయ కుట్ర లేదని, నిబంధనల ప్రకారమే నోటీసులు ఇచ్చామని వివరించారు. ఆదేశాల మేరకు ఫ్యాక్టరీని మూసివేయకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు.
నవీకరించబడిన తేదీ – జనవరి 28, 2024 | 01:27 PM