ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు తాజా తీర్పు కేంద్రంలోని బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. 2016-2022 మధ్య కాలంలో ఈ పథకం ద్వారా అత్యధికంగా విరాళాలు అందుకున్న పార్టీ బీజేపీయేనని, బాండ్ పథకం రద్దుతో ఆ పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 60 శాతం విరాళాలు ఒక్క బీజేపీకే బాండ్ల ద్వారా అందాయి. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. ఇది పౌరుల ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు పేర్కొంది.
ఎలక్టోరల్ బాండ్లు సమాచార హక్కు, వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎలక్టోరల్ బాండ్లు రాజకీయ పార్టీలకు సంస్థలు ఇచ్చే విరాళాలు అని తెలిసిందే. వీటిని 2017-18లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి రాజకీయ పార్టీలకు విరాళాలు వస్తున్నాయి.
కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్, సీపీఐ (ఎం), ఎన్జీవో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ గత ఏడాది అక్టోబర్ 31న ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ కేసుపై కోర్టు తీర్పు వెలువరించింది.
ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం, 2016 మరియు 2022 మధ్య రూ.16,437.63 కోట్ల విలువైన 28,030 ఎలక్టోరల్ బాండ్లు విక్రయించబడ్డాయి. బీజేపీ అత్యధికంగా రూ.10,122 కోట్ల విరాళాన్ని అందుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కు రూ.1,547 కోట్లు, టీఎంసీకి రూ.823 కోట్లు వచ్చాయి. జాబితాలోని 30 పార్టీల కంటే ఎక్కువ విరాళాలు బీజేపీకి అందాయి. 2017 నుంచి 2022 వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాంగ్రెస్ కంటే బీజేపీ ఐదు రెట్లు ఎక్కువ విరాళాలు పొందినట్లు EC డేటా చూపుతోంది.
7 జాతీయ పార్టీలకు విరాళాలు అందాయి
బీజేపీ: రూ. 10,122 కోట్లు
కాంగ్రెస్: రూ. 1,547 కోట్లు
టీఎంసీ: రూ. 823 కోట్లు
సీపీఐ(ఎం): రూ. 367 కోట్లు
ఎన్సీపీ: రూ. 231 కోట్లు
బీఎస్పీ: రూ. 85 కోట్లు
సీపీఐ: రూ. 13 కోట్లు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి చేయండి
https://www.youtube.com/watch?v=KCWMCjTZALలు
నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 15, 2024 | 03:52 PM