పుతిన్ను విమర్శించే వారు లేరు
మాస్కో, ఫిబ్రవరి 18: రష్యా ప్రతిపక్ష నేత, కార్యకర్త అలెక్సీ నవల్నీ ఆకస్మిక మరణం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సహజంగానే మరణించాడని అధికారులు చెబుతున్నా.. ప్రపంచ దేశాలు.. ముఖ్యంగా యూరప్ దేశాలు నమ్మడం లేదు. ఎందుకంటే.. పుతిన్ ను విమర్శించిన వారిలో మృతులంతా అనుమానాస్పదంగా ప్రాణాలు విడిచారు. పుతిన్ ప్రత్యర్థుల మరణం వెనుక విమాన ప్రమాదాలు, విష ప్రయోగాలు, ఆత్మహత్యలు ఇలా ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీటిని ప్రభుత్వం ప్రమాదాలు, ఆత్మహత్యల జాబితాలో చేర్చిందన్న వాదన కూడా ఉంది. తాజాగా నవాల్నీ మృతితో ఈ ఘటనలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇప్పుడు నవల్నీ మరణంపై అన్ని వేళ్లు పుతిన్ వైపు చూపిస్తున్నాయి. నవాల్నీ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక పుతిన్ ప్రభుత్వ హస్తం ఉందన్నారు. చాలా మంది ప్రపంచ స్థాయి నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. రష్యా ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా పుతిన్ ప్రభుత్వంపై అనుమానాలు వ్యక్తం చేశారు. నవాల్నీ మృతదేహాన్ని సలేఖర్డ్ మార్చురీలో ఉంచినట్లు రష్యా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించినప్పటికీ.. అక్కడి నుంచి అదృశ్యం కావడం అనుమానాలకు తావిస్తోంది. నవల్నీ తల్లి, న్యాయవాది, మార్చురీకి వెళ్లినప్పుడు, మృతదేహం అక్కడ లేదని అధికారులు సమాధానమిచ్చారు. దీంతో వారు చేసేదేమీ లేక వెనుదిరగాల్సి వచ్చింది. మరోవైపు నవాల్నీ మృతిపై యూరప్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రష్యాలోని 32 నగరాల్లో ఆదివారం భారీ నిరసనలు జరిగాయి. రష్యా పోలీసులు కనీసం 400 మందిని అరెస్టు చేశారు.
ఇవే ఉదాహరణలు!
ఎవ్జెనీ ప్రిగోజిన్: అతను పుతిన్కు అత్యంత సన్నిహితుడు. వాగ్నెర్ కిరాయి సమూహానికి మాజీ అధిపతి. కానీ ప్రిగోజిన్ దళాలు క్రెమ్లిన్పై తిరుగుబాటు చేసి రెస్టోవ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఆపై ప్రిగోజిన్ గతేడాది విమాన ప్రమాదంలో మరణించింది.
బోరిస్ బెరెజోవ్స్కీ: అతను రష్యన్ వ్యాపారవేత్త. పుతిన్ను తరచుగా విమర్శించేవాడు. అతను 2000 సంవత్సరంలో దేశం విడిచిపెట్టాడు. 2007లో పన్ను ఎగవేత కేసులో రష్యా కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. 2013లో బోరిస్ బ్రిటన్లోని తన నివాసంలో బాత్రూమ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. వీరితో పాటు ఎఫ్ఎస్బీ సెక్యూరిటీ సర్వీసెస్ మాజీ సభ్యుడు అలెగ్జాండర్ లిట్వినెంకో, పబ్లిక్ ఫిగర్గా పనిచేసిన అలెగ్జాండర్ పెరిపిలిచిని, రష్యన్ లాయర్ సెర్గీ మాగ్నిట్స్కీ, రష్యా షిప్యార్డ్ హెడ్గా పనిచేసిన అలెగ్జాండర్ బుజాకోవ్ తదితరులు అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయారు. వారంతా చేసిన పాపం పుతిన్ విమర్శకులుగా మారడమే.
నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 19, 2024 | 04:29 AM