టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధృవ్ జురెల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ధృవ్ జురెల్పై సునీల్ గవాస్కర్ సంచలన ప్రశంసలు
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధృవ్ జురెల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్లో ధృవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. టైలెండర్ల సాయంతో ఒంటరిగా పోరాడాడు. 149 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్ 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 పరుగులు చేశాడు. టీమ్ ఇండియా మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తొలి సెంచరీకి 10 పరుగుల దూరంలో ఔటైనా.. సెంచరీ ఈక్వల్ ఇన్నింగ్స్ అంటూ పలువురు కొనియాడుతున్నారు.
భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ మరో అడుగు ముందుకేసి ధోనీతో పోల్చాడు. భవిష్యత్తులోనూ ఇదే ఆరు పద్దతి కొనసాగితే నిరాశ తప్పదని జోస్యం చెప్పారు. ‘అతని మానసిక పరిపక్వత నాకు ధోనీని గుర్తు చేస్తుంది. ఈరోజు అతను సెంచరీ సాధించవచ్చు, కానీ అదే ఏకాగ్రతతో ఆడితే ఎన్నో సెంచరీలు సాధిస్తాడు.’ గవాస్కర్ అన్నారు.
ఓవర్ నైట్ స్కోరు 30 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ధృవ్ మరో 60 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. కుల్దీప్తో కలిసి 76 పరుగులు, ఆకాశ్దీప్తో 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 353 పరుగులు చేసింది. ఆ తర్వాత ధ్రువ్ జురెల్ (90), యశస్వి జైస్వాల్ (73) రాణించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 307 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్కు 46 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ మూడో రోజు టీ విరామ సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. బెన్ఫాక్స్ (0), జానీ బెయిర్స్టో (30) క్రీజులో ఉన్నారు.