వికలాంగులు: 10 మార్కుల్లో మాత్రమే ఉత్తీర్ణత

వికలాంగులు: 10 మార్కుల్లో మాత్రమే ఉత్తీర్ణత

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-11-08T14:49:35+05:30 IST

6 నుంచి 10వ తరగతి చదువుతున్న మానసిక, శారీరక వికలాంగ విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో అనేక మినహాయింపులు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆయా విద్యార్థుల ఉత్తీర్ణత మార్కులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

వికలాంగులు: 10 మార్కుల్లో మాత్రమే ఉత్తీర్ణత

10 మార్కుల్లో మాత్రమే ఉత్తీర్ణత

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్ , నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): 6 నుంచి 10వ తరగతి చదువుతున్న మానసిక, శారీరక వికలాంగ విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో అనేక మినహాయింపులు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆయా విద్యార్థుల ఉత్తీర్ణత మార్కులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల మానసిక సమస్యలు, మూగ, చెవిటి, మెదడు సంబంధిత వ్యాధులు, తలసేమియా, హీమోఫిలియా రోగులు, తీవ్రమైన శాశ్వత వైకల్యాలు, పాక్షిక అంధత్వం, కాలు మరియు చేయి విచ్ఛేదనం, వెన్నెముక సమస్యలు, పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తులకు మినహాయింపులు వర్తిస్తాయి. యాసిడ్ దాడి బాధితులకు కూడా మినహాయింపులు ఇచ్చారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాకాటి కరుణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని అనుసరించి తీవ్రమైన మానసిక, శారీరక సమస్యలున్న వారికి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులను 35 నుంచి 10కి తగ్గించారు. అలాగే, మూగ, చెవిటి, ఇతర వికలాంగులకు ఉత్తీర్ణత మార్కులు 35 నుంచి 20కి తగ్గించబడ్డాయి. ఈ మినహాయింపులు 6, 7, 8, 9 తరగతులతో పాటు 10వ తరగతి బోర్డు పరీక్షలకు కూడా వర్తిస్తాయి. అలాగే పరీక్ష సమయంలో వారికి గంట వ్యవధి తర్వాత 20 నిమిషాల విరామం ఇవ్వబడుతుంది. అదేవిధంగా కాలిక్యులేటర్‌లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు కూడా అనుమతించబడతాయి. వారికి మూడు భాషలకు బదులుగా ఒకే భాష పరీక్ష ఉంటుంది. వీరు రాసిన జవాబు పత్రాలను సరి చేసేందుకు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమిస్తారు. ఈ విద్యార్థులు ఒకరి బదులు మరొకరు కూడా పరీక్షలు రాసే సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమలులోకి వస్తుందని విద్యాశాఖ తెలిపింది.

నవీకరించబడిన తేదీ – 2022-11-08T14:49:37+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *