ముందుగా ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసై ఆర్టీసీ అధికారులను ఆదివారం రాజ్భవన్కు ఆహ్వానించారు.

TSRTC బిల్లుకు గవర్నర్ ఆమోదం (1)
TSRTC బిల్లుకు గవర్నర్ ఆమోదం: తెలంగాణ ఆర్టీసీ విలీన ముసాయిదా బిల్లుకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. TSRTC బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఆర్టీసీ అధికారులతో చర్చించిన అనంతరం బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఆర్టీసీ బిల్లుకు తాను వ్యతిరేకం కాదని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. దీంతో ఇవాళ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ముందుగా ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసై ఆర్టీసీ అధికారులను ఆదివారం రాజ్భవన్కు ఆహ్వానించారు. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్టీసీ అధికారులు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో సమావేశమయ్యారు. ఆర్టీసీ బిల్లుపై అధికారులను గవర్నర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు.
Sunil Kanugolu Survey On T Congress : టీ కాంగ్రెస్ గెలిచే సీట్లు ఇవే.. హైకమాండ్ చేతికి రిపోర్ట్
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని జులై 31న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం.. మనీ బిల్లు కావడంతో గవర్నర్ తప్పనిసరి. దీంతో కేబినెట్ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం రాజ్భవన్కు పంపింది.
అయితే ఈ బిల్లుపై పలు అనుమానాలున్నాయని, వాటిపై స్పష్టత ఇవ్వాలని గవర్నర్ కార్యాలయం ప్రభుత్వాన్ని కోరింది.
ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో గవర్నర్ మళ్లీ అదనపు సమాచారం కోరారు. ప్రభుత్వం మరోసారి అదనపు సమాచారం ఇచ్చింది. రెండు రోజుల పాటు బిల్లుపై ఉత్కంఠ కొనసాగింది. అయితే ఆర్టీసీ బిల్లును గవర్నర్ అడ్డుకుంటున్నారంటూ ఆర్టీసీ కార్మికులు బంద్కు పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ : వచ్చేసారి నేను ఉండకపోవచ్చు. అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..
దీంతోపాటు శనివారం రాజ్భవన్ను ముట్టడించారు. ఈ మేరకు రాజ్ భవన్ కార్యాలయం వివరణ ఇచ్చింది. ఎట్టకేలకు ఆదివారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశమైన గవర్నర్ ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ విలీన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.