IND vs WI T20 Match: అబ్బాయిలు ఏం చేస్తారు..! మూడో టీ20 మ్యాచ్‌లో ఆ ఇద్దరు ఔట్.. యువ సంచలనం ఎంట్రీ..

IND vs WI T20 Match: అబ్బాయిలు ఏం చేస్తారు..!  మూడో టీ20 మ్యాచ్‌లో ఆ ఇద్దరు ఔట్.. యువ సంచలనం ఎంట్రీ..

2016 నుంచి భారత్‌పై వెస్టిండీస్ టీ20 సిరీస్ గెలవలేదు.అయితే ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌ను గెలుస్తామని వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ దీమా వ్యక్తం చేశాడు.

IND vs WI T20 Match: అబ్బాయిలు ఏం చేస్తారు..!  మూడో టీ20 మ్యాచ్‌లో ఆ ఇద్దరు ఔట్.. యువ సంచలనం ఎంట్రీ..

IND vs WI 3వ T20 మ్యాచ్

IND vs WI 3వ T20 మ్యాచ్: భారత్ vs వెస్టిండీస్ మధ్య ఐదు T20 మ్యాచ్‌ల సిరీస్‌లో మూడవ T20 మ్యాచ్ మంగళవారం రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం) జరుగుతుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడిపోయింది. దీంతో మూడో టీ20లో గెలిచి సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని భారత ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. రెండు మ్యాచుల్లోనూ బ్యాటింగ్ ప్రదర్శనే టీమ్ ఇండియా ఓటమికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ తప్ప బ్యాట్స్ మెన్ భారీ స్కోరు చేయడంలో విఫలమవుతున్నారు. ఈ క్రమంలో మూడో మ్యాచ్ కు జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది.

IND vs WI : కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు చాహల్‌పై నమ్మకం లేదా..? కారణం ఏంటి..?

బ్యాటింగ్ విభాగంలో ఇషాన్ కిషన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అతని స్థానంలో యువ సంచలనం, ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌కు అవకాశం ఇవ్వాలని భారత జట్టు మేనేజ్‌మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సంజూ శాంసన్ కూడా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. అయితే వికెట్ కీపింగ్ బాధ్యతలను సంజూ చేపట్టే అవకాశం ఉంది. లేదంటే.. సంజును తొలగించి ఇషాన్‌ను జట్టులో ఉంచే అవకాశం ఉంది. వీరిద్దరిలో ఒకరికి మాత్రమే తుది జట్టులో అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో లేకపోవడం టీమ్ ఇండియాకు ఇబ్బందిగా మారింది. సూర్య ఫామ్‌లోకి వస్తే పరుగుల వరద పారడం ఖాయం. అయితే మూడో టీ20లో సూర్యకుమార్ పరుగుల వరద పారిస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

IND vs WI 2nd T20 Match: అంతా వీళ్లే..! భారత్ ఓటమిపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు

బౌలింగ్ విభాగంలోనూ మెరుగైన ప్రదర్శన చేయడంలో ఆటగాళ్లు విఫలమవుతున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో హార్దిక్ పాండ్యా మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. అర్ష్‌దీప్, ముఖేష్ కీలక సమయాల్లో పరుగులు తీశారు. ముఖ్యంగా ముఖేష్ పరుగుల పరంగా విఫలమవుతున్నాడు. ఈ క్రమంలో ముఖేష్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్, అవేశ్ ఖాన్ లను తుది జట్టులోకి తీసుకోవాలని హార్దిక్, ద్రవిడ్ ఆశిస్తున్నారు. స్పిన్ విభాగంలో చాహల్ రాణిస్తున్నాడు. కుల్దీప్ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన రవి బిష్ణోయ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అయితే కుల్దీప్ ఫిట్ గా ఉన్నాడని, మూడో టీ20కి తుది జట్టులోకి వస్తాడని తెలుస్తోంది. భారత్‌కు మూడో టీ20 మ్యాచ్ డూ ఆర్ డైగా మారగా, మూడో మ్యాచ్‌లో గెలిచి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని వెస్టిండీస్ జట్టు పట్టుదలతో ఉంది.

IND VS WI 2nd T20: ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ విజయం.. వరుసగా రెండు T20లు

2016 నుంచి భారత్‌పై వెస్టిండీస్ టీ20 సిరీస్ గెలవలేదని.. అయితే ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌ను గెలుస్తామని వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ అన్నాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో భారత్, వెస్టిండీస్ 27 సార్లు తలపడ్డాయి. ఈ సమయంలో, భారత జట్టు 17 మ్యాచ్‌లు గెలవగా, వెస్టిండీస్ జట్టు తొమ్మిది మ్యాచ్‌లు గెలిచింది. మిగిలిన మ్యాచ్‌లు అసంపూర్తిగా ఉన్నాయి. మరోవైపు ఈరోజు మ్యాచ్ జరగనున్న గయానా మైదానంలో బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ పిచ్ స్పిన్నర్లకు మేలు చేసే అవకాశం ఉంది. ఇక్కడ లక్ష్యం చేయడం కొంచెం సులభం. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

భారత తుది జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్/ఇషాన్ కిషన్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్/ముఖేష్, కుల్దీప్ యాదవ్.

విండీస్ ఫైనల్ స్క్వాడ్ (అంచనా): కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్, నికోలస్ వూరన్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకీల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *