జర్నలిస్ట్ కృష్ణారావు: ప్రముఖ జర్నలిస్టు సిహెచ్ విఎం కృష్ణారావు కన్నుమూశారు

జర్నలిస్ట్ కృష్ణారావు: ప్రముఖ జర్నలిస్టు సిహెచ్ విఎం కృష్ణారావు కన్నుమూశారు

సీనియర్ జర్నలిస్టు సిహెచ్‌విఎం కృష్ణారావు

సిహెచ్‌విఎం కృష్ణారావు: ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిహెచ్‌విఎం కృష్ణారావు అనారోగ్యంతో గురువారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని గోపన్‌పల్లి జర్నలిస్ట్‌ కాలనీలోని ఆయన నివాసంలో ఉంచారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 47 ఏళ్లుగా జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించారు. డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్‌లో 18 ఏళ్లపాటు బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. ఉద్యోగ బాధ్యతల నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా విశ్లేషకుడిగా సేవలందించారు. న్యూస్ ఛానల్స్ లో డిబేట్ లలో అనలిస్ట్ గా వచ్చేవారు. రోజూ దినపత్రికల్లో కథనాలు రాసేవాడు. ముఖ్యంగా సమకాలీన రాజకీయాలపై ఆయన రాసిన అనేక వ్యాసాలు ప్రముఖ దినపత్రికల్లో వచ్చాయి.

మీడియా రంగానికి పూడ్చలేని లోటు
సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు. కింది స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగి.. తెలుగు, ఇంగ్లిష్ జర్నలిజంలో
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మంచి ప్రావీణ్యం సంపాదించారని గుర్తు చేసుకున్నారు. రాజకీయ విశ్లేషణలో తనదైన ముద్ర వేసిన కృష్ణారావు మృతి మీడియా రంగంలో పూడ్చలేని లోటు అని ఏపీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు.

కృష్ణారావు మృతి బాధాకరమన్నారు
కృష్ణారావు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సంతాపం తెలిపారు. పాత్రికేయ విలువలకు కట్టుబడి రచనలు, విశ్లేషణల్లో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన కృష్ణారావు మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. పెద్ద బాబాగా అందరికీ సుపరిచితుడైన కృష్ణారావు గత నాలుగు దశాబ్దాలుగా వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తూ ఎనలేని సేవలందించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ సంతాపం తెలిపారు. 4 దశాబ్దాలుగా రాజకీయ విశ్లేషణ రంగంలో తనదైన ముద్ర వేసిన కృష్ణారావు మృతి తీరని లోటని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

ఇది కూడా చదవండి: టీటీడీ చైర్మన్ భూమన ఆదేశాల మేరకు భక్తులకు కర్రల పంపిణీపై ట్రోల్స్‌పై స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *