బ్రేకింగ్: చంద్రబాబుపై మరో అక్రమ కేసు నమోదు చేసిన సీఐడీ!

బ్రేకింగ్: చంద్రబాబుపై మరో అక్రమ కేసు నమోదు చేసిన సీఐడీ!

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-09-19T18:00:52+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీఐడీ మరో అక్రమ కేసు నమోదు చేసింది. ఫైబర్ నెట్ స్కాంపై సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ వారెంట్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది.

బ్రేకింగ్: చంద్రబాబుపై మరో అక్రమ కేసు నమోదు చేసిన సీఐడీ!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీఐడీ మరో అక్రమ కేసు నమోదు చేసింది. ఫైబర్ నెట్ స్కాంపై సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ వారెంట్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో నారా చంద్రబాబును సీఐడీ ప్రధాన నిందితుడిగా పేర్కొనడం గమనార్హం. టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ నెట్ కాంట్రాక్టును కట్టబెట్టారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. PT వారెంట్ ఫైల్ నంబర్ 2916/2023. రూ.121 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని విచారణలో తేలిందని సిట్ ఆరోపిస్తోంది. కాగా, 2021లో జరిగిన ఫైబర్ నెట్ స్కాంలో 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ వేమూరి హరిప్రసాద్‌ను ఏ1గా, మాజీ ఎండీ సాంబశివరావును ఏ2గా చేర్చింది. ఒకదాని తర్వాత ఒకటి అక్రమ కేసులు పెట్టి ఎన్నికల ముందు చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారని రాజకీయ, న్యాయ నిపుణులు అంటున్నారు.

చంద్రబాబు.jpg

ఇప్పటికే ఇలా..!

ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై కూడా ఈరోజు విచారణ జరిగింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. ప్రభుత్వం తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది. మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. రెండు రోజుల తర్వాత కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ అక్రమ కేసులో ప్రభుత్వానికి షాక్ తగులుతుందని తెలిసి మరో అక్రమ కేసు బనాయించారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

CID-Vs-ACB.jpg






నవీకరించబడిన తేదీ – 2023-09-19T18:27:18+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *