న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నెదర్లాండ్స్ బౌలర్ బాస్ డి లీడే వేసిన ఇన్నింగ్స్ చివరి బంతికి న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ 13 పరుగులు చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

వన్డే ప్రపంచకప్ టోర్నీ రోజురోజుకూ పురోగమిస్తోంది. ప్రస్తుతం చిన్న జట్ల మధ్యే ఎక్కువగా మ్యాచ్ లు జరుగుతున్నా భారీ స్కోర్లు నమోదవుతుండడంతో క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నెదర్లాండ్స్ బౌలర్ బాస్ డి లీడే వేసిన ఇన్నింగ్స్ చివరి బంతికి న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ 13 పరుగులు చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
అసలేం జరిగిందంటే.. డచ్ బౌలర్ బాస్ డి లీడే వేసిన చివరి బంతి నో బాల్. బంతి నడుము ఎత్తుపై పడడంతో అంపైర్ నో బాల్గా ప్రకటించాడు. సాంట్నర్ ఈ బంతిని సిక్సర్ కొట్టి మొత్తం ఏడు పరుగులు చేశాడు. మరోవైపు నో బాల్ కావడంతో ఫ్రీ హిట్ వచ్చింది. ఫ్రీ హిట్ బాల్ ను నెదర్లాండ్స్ బౌలర్ ఫుల్ గా టాస్ చేయడంతో సాంట్నర్ మరో సిక్సర్ కొట్టాడు. దీంతో ఒక్కో బంతికి 13 పరుగులు వచ్చాయి.
ఇది కూడా చదవండి: శుభ్మన్ గిల్ vs మహ్మద్ సిరాజ్: ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో సిరాజ్, గిల్
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. విల్ యంగ్ (70), రచిన్ రవీంద్ర (51), కెప్టెన్ టామ్ లాథమ్ (53) అర్ధ సెంచరీలతో రాణించారు. సాంట్నర్ 17 బంతుల్లో 36 పరుగులు చేసి న్యూజిలాండ్ స్కోరు 300 దాటడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత 323 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు న్యూజిలాండ్ స్పిన్నర్ సాంట్నర్ ధాటికి 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో సాంట్నర్ ఆల్ రౌండర్గా రాణించాడు. 59 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఈ ప్రపంచకప్లో ఐదు వికెట్లు తీసిన తొలి న్యూజిలాండ్ స్పిన్నర్గా కూడా సాంట్నర్ నిలిచాడు.
నవీకరించబడిన తేదీ – 2023-10-10T15:09:05+05:30 IST