BalaKrishna: గచ్చిబౌలి సభపై బాలయ్య ట్వీట్.. టీడీపీ అభిమానులకు ధన్యవాదాలు

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-10-30T17:15:34+05:30 IST

హైదరాబాద్ గచ్చిబౌలిలో టీడీపీ నిర్వహించిన గ్రాట్యుటీ కార్యక్రమం సూపర్ డూపర్ హిట్ కావడంతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

BalaKrishna: గచ్చిబౌలి సభపై బాలయ్య ట్వీట్.. టీడీపీ అభిమానులకు ధన్యవాదాలు

టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఏపీ వ్యాప్తంగా ప్రజలు నమ్ముతున్నారు. సీఎం జగన్ తమపై కక్ష సాధింపునకు పాల్పడుతూ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ రకరకాలుగా నిరసన తెలుపుతోంది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఐయామ్ విత్ సీబీఎన్ అనే గ్రాట్యుటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన సభకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుతో పాటు సినీ నిర్మాత బండ్ల గణేష్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, శ్రీలింగంపల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొన్నారు.

హైదరాబాద్ గచ్చిబౌలిలో టీడీపీ నిర్వహించిన గ్రాట్యుటీ కార్యక్రమం సూపర్ డూపర్ హిట్ కావడంతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. గచ్చిబౌలిలో చంద్రబాబుకు కృతజ్ఞతగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి సభకు హాజరైన అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబుకు తిరుగులేని మద్దతు పలికిన తమ ప్రియతమ నాయకుడిపై అభిమానులు ఈ సభ ద్వారా చూపుతున్న ప్రేమ, గౌరవం తనను కదిలించాయని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. దార్శనికత కలిగిన నేతగా పేరున్న చంద్రబాబును జైల్లో పెట్టినా.. రాజకీయంగా తాము బలవంతులమని స్పష్టం చేశారు. చంద్రబాబు పెట్టిన కేసులు రాజకీయ కక్ష సాధింపులని తాము నమ్ముతున్నామని.. కష్టకాలంలో అభిమానులు ఈ సభ ద్వారా సంఘీభావం తెలపడం తమలో ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. అనివార్య కారణాల వల్ల ఈ సమావేశానికి హాజరు కాలేకపోయినా.. అభిమానులు చూపుతున్న నమ్మకానికి, నిబద్ధతకు రుణపడి ఉంటానని బాలయ్య పేర్కొన్నారు. కడిగిన ముత్యంలా చంద్రబాబు త్వరలోనే జైలు నుంచి విడుదలవుతారని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.

బాలయ్య ట్వీట్.jpg

నవీకరించబడిన తేదీ – 2023-10-30T17:17:30+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *