చివరిగా నవీకరించబడింది:
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ప్రాణాంతక జికా వైరస్ను గుర్తించిన తర్వాత ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆరోగ్యశాఖ అధికారులు కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సంక్షోభాన్ని తొలిదశలోనే పరిష్కరించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు

జికా వైరస్: కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ప్రాణాంతక జికా వైరస్ను గుర్తించడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆరోగ్యశాఖ అధికారులు కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సంక్షోభాన్ని తొలిదశలోనే పరిష్కరించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని 68 ప్రాంతాల్లో దోమల్లో జికా వైరస్ ఉందో లేదో పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే చిక్కబళ్లాపుర జిల్లాలోని ఆరు ప్రాంతాల నుంచి నమూనాలు సేకరించారు. సిడ్లఘట్ట తాలూకాలోని తలకాయలబెట్ట గ్రామంలో దోమల్లో జికా వైరస్ కనిపించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే నివారణ చర్యలు ప్రారంభించారు.
బెంగళూరుకు రక్త నమూనాలు..(జికా వైరస్)
30 మంది గర్భిణులు, ఏడుగురి జ్వరం లక్షణాలతో రక్త నమూనాలు సేకరించిన అధికారులు పరీక్షల నిమిత్తం బెంగళూరుకు పంపించారు. తలకాయల బెట్ట గ్రామానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల నుంచి నమూనాలు సేకరించారు. వెంకటాపుర, దిబ్బురహళ్లి, బచ్చనహళ్లి, వడ్డహళ్లి తదితర ప్రాంతాల్లో అధికారులు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. చిక్కబళ్లాపుర జిల్లాలో జికా వైరస్ ఉన్నట్లు జిల్లా ఆరోగ్య అధికారి మహేష్ కుమార్ ధృవీకరించారు. ఈ ప్రాంతంలో సుమారు 5 వేల మందిని ఆరోగ్య శాఖ అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
జికా వైరస్ అనేది దోమల ద్వారా సంక్రమించే వైరస్. ఇది ప్రధానంగా సోకిన ఏడిస్ దోమ కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. 1947లో మొదటిసారిగా గుర్తించబడిన ఉగాండాలోని జికా ఫారెస్ట్ పేరు మీద ఈ వైరస్ పేరు పెట్టబడింది. జికా వైరస్ సోకిన చాలా మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కళ్ళు ఎర్రబడటం మరియు కండరాల నొప్పి వంటి తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి.