గౌతం గంభీర్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమిపై మాజీ ఆటగాడు గౌతం గంభీర్ స్పందించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా కూర్పుపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్కు ముందు టీమిండియాకు చాలా తక్కువ మ్యాచ్లు మాత్రమే ఉండేవని చెప్పాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమిపై మాజీ ఆటగాడు గౌతం గంభీర్ స్పందించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా కూర్పుపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్కు ముందు టీమిండియాకు చాలా తక్కువ మ్యాచ్లు మాత్రమే ఉండేవని చెప్పాడు. బ్యాటింగ్ ఆర్డర్లో శ్రేయాస్ అయ్యర్ను ఎందుకు పక్కన పెట్టాడో అర్థం కావడం లేదని గంభీర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20లో శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఎడమచేతి వాటం ఆటగాడు శ్రేయాస్ను పక్కన పెట్టారా లేదా అతను గాయపడ్డాడా అని గంభీర్ జట్టు మేనేజ్మెంట్ను ప్రశ్నించాడు. అలాంటప్పుడు నంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారో చెప్పాలన్నారు. దీనిపై కెప్టెన్ సూర్యకుమార్, టీమ్ మేనేజ్మెంట్ క్లారిటీ ఇవ్వాలని గంభీర్ స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుతంగా రాణించాడని మాజీ ఆటగాడు పీయూష్ చావ్లా గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న అతడు.. జట్టులోకి ఎంపికవ్వాలని అభిప్రాయపడ్డాడు. నంబర్ వన్ బౌలర్ను బెంచ్కు పరిమితం చేయడం అతనిపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని పీయూష్ చావ్లా అన్నాడు. మరోవైపు ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ కూడా టీమ్ ఇండియా కూర్పుపై పలు ప్రశ్నలు లేవనెత్తాడు. మూడో స్థానంలో శ్రేయాస్ అయ్యర్కు బదులుగా తిలక్ వర్మను పంపడం తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందని చెప్పాడు. తుది జట్టులో శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్ లేకపోవడం నిరాశపరిచిందని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.
మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవీకరించబడిన తేదీ – 2023-12-13T14:55:44+05:30 IST