బీహార్ రాజకీయాలు: క్షణక్షణం ఉత్కంఠ.. మంతనాలలో పార్టీల గొడవ

బీహార్ రాజకీయాలు: క్షణక్షణం ఉత్కంఠ.. మంతనాలలో పార్టీల గొడవ

న్యూఢిల్లీ: బీహార్ రాజకీయాల్లో సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ తరుణంలో తన పదవికి రాజీనామా చేయబోతున్నారని, మళ్లీ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్న తరుణంలో నితీష్‌ను రంగంలోకి దించేందుకు బీజేపీ అధిష్టానం ఎత్తుగడలు వేస్తోంది. అదే సమయంలో అధికార మహాకూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ కూడా వరుస సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, బలం పుంజుకోవడానికి ఉన్న అవకాశాలపై చర్చిస్తోంది.

బీహార్‌లో రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఎల్‌జేపీ (రామ్‌విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ శనివారం కేంద్ర మంత్రి అమిత్‌తో హస్తినలోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొని పరిస్థితిని సమీక్షించారు. పొత్తులకు సంబంధించి సానుకూల పరిస్థితి ఉందని చిరాగ్ పాశ్వాన్ సమావేశం అనంతరం మీడియాతో అన్నారు. బీహార్‌పై తనకున్న ఆందోళనను అగ్రనేతలకు వివరించానని, వారు పలు అంశాలపై తనకు హామీ ఇచ్చారని చిరాగ్ చెప్పారు. తమ పార్టీ పరిస్థితిపై స్పష్టత రాగానే నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికి తాము ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నామని చెప్పారు.

బీజేపీ కోర్ కమిటీ సమావేశం

మరోవైపు బీహార్ బీజేపీ కోర్ కమిటీ సమావేశం పాట్నాలో జరుగుతోంది. ఈ సమావేశంలో అసెంబ్లీ ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హా, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, బీజేపీ ఎంపీ, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్, బీజేపీ బీహార్ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి పాల్గొన్నారు.

జేడీయూ, ఆర్జేడీ..

కాగా, శనివారం ఉదయం పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో జనతాదళ్ (యునైటెడ్) మాజీ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ (లాలన్) సింగ్ భేటీ అయ్యారు. మరోవైపు ఆర్జేడీ నేత, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ నివాసంలో పలువురు నేతలు సమావేశమయ్యారు. తేజస్విని కలిసిన వారిలో విజయ్ కుమార్ మండల్, లలిత్ కుమార్ యాదవ్, అబ్దుల్ బారీ సిద్ధిఖీ, బీహార్ న్యాయ శాఖ మంత్రి షమీమ్ అహ్మద్, బినోద్ జైశ్వాల్ తదితరులు ఉన్నారు.

నవీకరించబడిన తేదీ – జనవరి 27, 2024 | 02:58 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *