వరదలు, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోలు ధర లీటరుకు రూ.14.91 పెరగగా, హైస్పీడ్ డీజిల్ ధర లీటరుకు రూ.18.44 పెరిగింది.

ఇస్లామాబాద్ : వరదలు, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోలు ధర లీటరుకు రూ.14.91 పెరగగా, హైస్పీడ్ డీజిల్ ధర లీటరుకు రూ.18.44 పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.305.36కి, లీటర్ డీజిల్ ధర రూ.311.84కి చేరింది. పాకిస్థాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
దశాబ్దాల చరిత్రలో పాకిస్థాన్ అత్యంత దారుణమైన సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలి ఆర్థిక సంస్కరణలు అధిక ద్రవ్యోల్బణం మరియు అధిక వడ్డీ రేట్లకు దారితీశాయి. దీంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పాకిస్థాన్ రూపాయి విలువ క్షీణించడంతో సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతోంది. అమెరికా డాలర్తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. కరెన్సీ డాలర్కు రూ.305.6కి పడిపోవడం తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం, తాత్కాలిక ప్రధాని అన్వరుల్ హక్ కాకర్ నేతృత్వంలోని మంత్రివర్గం పరిపాలనను నిర్వహిస్తోంది. దేశాన్ని ఆర్థిక స్థిరత్వం వైపు నడిపించడం ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం బాధ్యత. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 3 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి అంగీకరించడంతో పాకిస్థాన్ ఊపిరి పీల్చుకుంది.
ఇది కూడా చదవండి:
వన్ నేషన్-వన్ ఎలక్షన్: ‘ఒకే దేశం-ఒకే ఎన్నికల’ కోసం కేంద్రం మరో ముందడుగు వేసింది.
నవీకరించబడిన తేదీ – 2023-09-01T11:57:33+05:30 IST