అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారు

అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారు

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-11-03T05:34:24+05:30 IST

అదానీ అక్రమాలు, కేంద్రం కల్పిస్తున్న ప్రయోజనాల గురించి పార్లమెంట్‌లో వెల్లడిస్తూ మోదీ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు మహువా మోయిత్రా వేధిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ అన్నారు.

అనుచిత ప్రశ్నలు అడిగారు

నువ్వు ఎవరితో దుబాయ్ వెళ్లావు..ఎవరితో ఫోన్ లో మాట్లాడావు అని అడిగారు

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు

న్యూఢిల్లీ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): అదానీ అక్రమాలు, కేంద్రం కల్పిస్తున్న ప్రయోజనాల గురించి పార్లమెంట్‌లో వెల్లడిస్తూ మోదీ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు మహువా మోయిత్రా వేధిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ అన్నారు. మహాను ఎథిక్స్ కమిటీ చైర్మన్, బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ నీతి మరిచి అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారని, దీంతో ఆయనతో పాటు ఐదుగురు విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారని అన్నారు. దుబాయ్ ఎందుకు వెళ్లావు, ఎవరితో వెళ్లావు, ఎవరితో ఫోన్ మాట్లాడావు ఆ ఫోన్ మాకు ఇవ్వండి అంటూ ఉత్తమ్ వెల్లడించారు. లోక్‌సభలో ప్రశ్నలు అడిగినందుకు మహువా డబ్బులు తీసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు లేవని అన్నారు. ఈ విషయంలో జాతీయ భద్రత అంశం ఎక్కడిదని ఉత్తమ్ ప్రశ్నించారు.

ఆమె మాజీ సహోద్యోగిని ఉపయోగించి మహువాను అవమానించడానికి మరియు పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టా అన్నారు. పార్లమెంట్‌లో ఎంపీలను ప్రశ్నలు అడగడానికి ఎంపీల పీఏలు ఎన్‌ఐసీ పోర్టల్‌ను ఉపయోగించేందుకు నిర్దిష్ట మార్గదర్శకాలు లేవని ఉత్తమ్ చెప్పారు. తన ప్రశ్నలను కూడా పీఏ ద్వారా అడుగుతానని చెప్పారు. మహిళలను అడగకూడని ప్రశ్నలు మోయిత్రా అడిగారని గిరిధారి యాదవ్ అన్నారు. అనైతికమైన, అసభ్యకరమైన ప్రశ్నలు అడగడం ఏమిటని డానిష్ అలీ విమర్శించారు. సోనియా గాంధీ ఆదేశాల మేరకే తాను కమిటీ సమావేశానికి హాజరయ్యానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మహువా మొయిత్రాకు పార్టీ గట్టి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. మహువాపై ఎథిక్స్ కమిటీ వ్యవహరించిన తీరును తృణమూల్, సీపీఎం తీవ్రంగా ఖండించాయి.

నవీకరించబడిన తేదీ – 2023-11-03T05:34:27+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *