ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఆలోచిస్తోంది. ఇప్పుడు ముందూ వెనుకా ఆలోచించకుండా చేసిన జిల్లాల వల్ల రాజకీయంగా తమకు పెద్ద దెబ్బ తగిలిందని వైసీపీకి అర్థమవుతోంది. విభజన వల్ల చాలా జిల్లాల్లో వైసీపీ తన ప్రాభవాన్ని కోల్పోతోందని, చివరకు ఉమ్మడి కడప జిల్లాలో భాగమైన అన్నమయ్య జిల్లాను కోల్పోయే ప్రమాదం ఉందని తేలిన వెంటనే జగన్ రెడ్డి రివర్స్ గేమ్ స్టార్ట్ చేస్తున్నారు. మళ్లీ జిల్లాలను పూర్తిగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పార్లమెంటు స్థానానికి ఒక జిల్లా చొప్పున ఇరవై ఐదు జిల్లాలు ఏర్పాటు చేస్తామని వైసీపీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ ఇరవై ఆరు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల సంఖ్యను పార్లమెంటు స్థానాలతో సమానంగా 25కి తగ్గించాలన్నారు. కారణం ఇదే అయినా అసలు నిజం రాజకీయ ప్రయోజనాలే. అన్నమయ్య జిల్లా ఏర్పాటు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కడప జిల్లాకు గండి పడుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. కడప జిల్లాను యథాతథంగా ఉంచి మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలను చిత్తూరు జిల్లాలో కలపాలని భావిస్తున్నారు. రాయచోటి ఎమ్మెల్యే అన్నమయ్య జిల్లా రద్దవుతుందని తెలియగానే అలాంటిదేమీ లేదని అంటున్నారు. అయితే ఆయన కూడా చర్చల్లో పాల్గొంటున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
అనంతపురం జిల్లాను మళ్లీ పూర్వ స్థితికి తీసుకురావాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సత్యసాయి జిల్లా రద్దయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. విభజన తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు కూడా ఇందుకు కారణం. జిల్లాల విభజన అస్తవ్యస్తంగా జరిగింది. అందుకే తాము అధికారంలోకి వస్తే జిల్లాలను పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తామని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఆ పని తామే చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నట్లే.
పోస్ట్ ఎన్నికల ముందు “నదుల జిల్లాలు” మొదట కనిపించింది తెలుగు360.